బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య

73பார்த்தது
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీలో ఆదివారం యువకుడి హత్య జరిగింది. కొత్తగూడెంకు చెందిన దినేష్ గా పోలీసులు గుర్తించారు. నిర్మానుష ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని తెలిపారు. దినేష్ రాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி