1901 తర్వాత దేశంలో ఈ ఏడాది ఆగస్టులోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు: ఐఎండీ

81பார்த்தது
1901 తర్వాత దేశంలో ఈ ఏడాది ఆగస్టులోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు: ఐఎండీ
భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. ఈ ఏడాది ఆగస్టులోనే దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 1901 తర్వాత ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. భారతదేశ సగటు నెలవారీ కనిష్ట ఉష్ణోగ్రత ఆగస్టులో ఆల్-టైమ్ రికార్డ్ 24.29 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. ఇది దేశంలో సాధారణ ఉష్ణోగ్రత 23.68°C కంటే అధికం. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అనేక కారణాల వల్ల నైరుతి రుతుపవనాలు ఆగస్టులో చాలా రోజులు చురుకుగా ఉన్నాయని తెలిపింది.

தொடர்புடைய செய்தி