మహాదేవ అనే ట్రాక్మ్యాన్ విధి నిర్వహణలో చూపిన తెగువ, సమయస్ఫూర్తి రైలు ప్రమాదాన్ని తప్పించింది. అతను కుమ్టా, హొన్నావర్ స్టేషన్ల మధ్య తనిఖీలు చేపట్టారు. అయితే ఓ చోట పట్టాలు సరిగా లేనట్లు గుర్తించారు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం - ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ వస్తోంది. వెంటనే అతను కుమ్టా స్టేషన్కు సమాచారం అందించగా రైలు ముందుకొచ్చేసింది. దీంతో మహాదేవ పట్టాల వెంట 5 నిమిషాల్లో అర కిలోమీటరు పరిగెత్తి.. చివరికి రైలును ఆపి వందలాది మంది ప్రాణాలను కాపాడారు.