మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వందే భారత్ రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైలు (02252) న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి 12 గంటలకు ప్రయాగ్రాజ్కు చేరుకుంటుంది. ఇక 2:20కి వారణాసి చేరుకుంటుందని నార్తర్న్ రైల్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.