పండగలు మతసామరస్యానికి ప్రతీకలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

58பார்த்தது
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ఆనవాలైన పండగలు మతసామరస్యానికి ప్రతీకలని, పండగలు నిర్వహించుకోవడం వల్ల మనుషుల మధ్య ఐక్యత నెలకొంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే "మిలాద్- ఉన్- నబి" సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ లో గల మహమ్మదీయ మసీదులో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி