పాఠశాల భవనం నిర్మించాలని వినతి

74பார்த்தது
పాఠశాల భవనం నిర్మించాలని వినతి
మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో పాఠశాల భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని మంగళవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామస్తులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతి పత్రం అందించారు. పాతబడిన పాఠశాలను కూల్చివేశారని అదే స్థలంలో నూతన భవనం నిర్మాణానికి టెండర్ పొందిన కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని, నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులు చేపడుతామని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி