అస్సాం ముఖ్యమంత్రి పై కోడేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

470பார்த்தது
అస్సాం ముఖ్యమంత్రి పై కోడేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు ఆదేశానుసారం కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిద్దె శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి రెడ్డి, మరియు వెంకట్ రెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు పసుపుల నాగేంద్రం, సోషల్ మీడియా రామ్ లక్ష్మణ్, ఉషణ్, మిద్దె రాములు, చెన్నకేశవులు, భాస్కర్, బాలరాజు, కోడేరు మహేష్, రాజు, నాగులపల్లి గోపాల్ రెడ్డి, జనంపల్లి గోపాల్ రెడ్డి, రాజు, వార్డ్ నెంబరు నాగేంద్రం, ఏలూరు శేషయ్య, ముత్తిరెడ్డి పల్లి చంద్రమౌళి, కురుమయ్య, రాములు. తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி