గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం దమ్మాయిపల్లి గ్రామ గుండగోని చెరువుకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె దమ్మాయిపల్లిలోని గుండగోని చెరువు, ఊర చెరువు, గణపతిరాయ చెరువులను ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు.