దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల పరిధిలోని ధమగ్నాపూర్ నుంచి సీతారాం పెటకు వెళ్లే దారిలో కుంటతెగి ప్రధాన దారిపై వరద నీరు పారుతుంది. ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉంద్యాల గ్రామంలో చెరువు అలుగు పారి గ్రామంలోని దళిత కాలనీలోకి నీరు చేరింది. సోమవారం అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయా గ్రామాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కరించాలన్నారు.