కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు

69பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆదివారం సాయంత్రం 10 గేట్లు 4 అడుగులు ఎత్తి నీటిని వదిలారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ప్రాజెక్టును చూడడానికి బారులు కట్టారు. నీరు పైనుంచి కిందికి భారీ ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో సందర్శకులు సెల్ఫీల మోజులో పడ్డారు. అది గమనించిన ఎస్ఐ నాగన్న అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని కిందికి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி