దేవరకద్ర: యువకులు సైనికుల వలె స్వచ్ఛందంగా ముందుకు రావాలి

59பார்த்தது
దేవరకద్ర: యువకులు సైనికుల వలె స్వచ్ఛందంగా ముందుకు రావాలి
యువకులు సమాజసేవలో సైనికుల వలె స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సందయ్యగారి సురేందర్ రెడ్డి అన్నారు. దసరా పండుగ సందర్భంగా దేవరకద్ర మండలం గోపనపల్లిలో గెలుపొందిన వాలీబాల్ జట్టులకు ఆదివారం మొదటి బహుమతి రూ. 4116, రెండవ బహుమతిగా రూ. 3116. నగదు, షీల్డ్ లు అందజేశారు. యువకుల ద్వారానే గ్రామాలకు మంచి పేరు వస్తుందని, చదువుతో పాటుగా క్రీడల్లో జిల్లా స్థాయి జాతీయస్థాయిలో పాల్గొని మంచి పేరు తీసుకురావాలని కోరారు.

தொடர்புடைய செய்தி