యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన బిడ్డతో పాటు రోడ్డుపై వెళ్తుండగా, నలుగురు యువకులు బైక్పై అటుగా వచ్చారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను తాకి ఇబ్బంది పెట్టారు. తర్వాత బైక్పై వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. మురాద్నగర్లోని ఖుర్రంపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.