ముంబైలోని ఘట్కోపుర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి కారులో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుండగా దాని పెచ్చులూడి కారుపై పడ్డాయి. ఆ సమయంలో కారులో ప్రయాణికులెవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. పురాతన ఫ్లైఓవర్ల కింద కార్ల నిలుపుదలతో పాటు మనుషులు కూడా వేచి ఉండవద్దని ప్రజలకు సూచించారు.