రైతుల‌ను బెదిరిస్తున్న మ‌హిళా పోలీస్‌.. వీడియో

67பார்த்தது
తెలంగాణ‌లో చాలా మంది రైతులు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో బ్యాంకులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో రైతులు బ్యాంక్ ముందు కూర్చుని త‌మ‌కు రుణ‌మాఫీ కాలేద‌ని నిర‌స‌న తెలిపారు. నిర‌స‌న చేస్తున్నార‌ని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ వ‌ద్ద‌కు వ‌చ్చి రైతుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. నిర‌స‌న చేస్తున్న రైతులంద‌ర్నీ క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని ఓ మ‌హిళా పోలీస్ (ఎస్సై) త‌న సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా రైతుల‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ మ‌హిళా పోలీస్‌.

தொடர்புடைய செய்தி