దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8, 9 తేదీల్లో భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ రానున్నారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హోదాలో ఆయన భారత్లో చేసే మొదటి అధికారిక పర్యటన ఇదే. ఆయనతోపాటు అనేక మంది మంత్రులు కూడా పాల్గొననున్నారు.