జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంధ్వా అనే చిన్న గ్రామంలో శోభిరామ్, వసంతిదేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5న జన్మించారు. 1914లో స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి మరణం తర్వాత తల్లి సహకారంతో మెట్రిక్యులేషన్ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. 1927లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. 1931లో సైన్సులో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.