నాగర్కర్నూల్ జిల్లాలోని SLBC సొరంగంలోసహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్న సహాయక బృందాలను అభినందించారు. రెట్టింపు వేగంతో సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించారు.