గంజాయి కేసులో బలిచేశారు.. కానిస్టేబుల్ సాగర్ మృతి (వీడియో)

68பார்த்தது
TG: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన భూక్యా సాగర్‌ (34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాగర్ ఆదివారం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’ అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమార్, మరో నేత నాని తనను గంజాయి కేసులో ఇరికించారని ఆ వీడియోలో తెలిపాడు.

தொடர்புடைய செய்தி