పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొట్టుకున్న కమిషనర్, డీఈ.. వీడియో వైరల్

54பார்த்தது
కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ లు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ దాడి చేసుకున్నారు. దీంతో కౌన్సిల్ సభ్యులు కల్పించుకొని గోడవను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంపై కమిషనర్ సమాధానం ఇస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. కాగా, కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி