హైదరాబాద్లోని హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. నాంపల్లిలోని ఓ దర్గాలో రియాన్, హుస్సేన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో హుస్సేన్ కత్తి తీసుకొని రియాన్ను పొడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రియాన్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు.