రాజస్థాన్ సీఎంకు ఫోన్ చేసిన చంద్రబాబు

53பார்த்தது
రాజస్థాన్ సీఎంకు ఫోన్ చేసిన చంద్రబాబు
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన గురించి భజన్ లాల్ తో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

தொடர்புடைய செய்தி