ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు

63பார்த்தது
ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు
దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది వరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన (బఫర్‌ స్టాక్‌) స్టాక్‌ను హోల్‌సేల్‌ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రూ.55-60 వరకు పలుకుతోంది.

தொடர்புடைய செய்தி