TG: మహబూబాబాద్ గూడూరు మండలంలోని నాయక్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడు ఎండబెట్టి ఉన్న పత్తి గింజను గొంతులో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.