భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు మరో యువతితో రావడం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ధనశ్రీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ మరింత సంచలనంగా మారింది. "ప్రతీ విషయంలో మహిళను బ్లేమ్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది" అని ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. ఇది కాస్త వైరల్గా మారింది. చాహల్, ధనశ్రీ విడాకుల వార్తలు వైరల్ అయిన వేళ ఆమె ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.