శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల ఘాట్ రోడ్‌లలో ద్విచక్రవాహనాలపై నిషేధం

51பார்த்தது
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల ఘాట్ రోడ్‌లలో ద్విచక్రవాహనాలపై నిషేధం
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమల ఘాట్ రోడ్‌లలో ద్విచక్రవాహనాలపై నిషేధం విధించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 8వ తేదీన గరుడసేవ జరుగుతున్న సందర్భంగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైక్‌ల రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி