నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటాం. అయితే శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా జరగాలంటే నీరు చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా.. కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిదని పేర్కొంటున్నారు.