దారుణం.. కృష్ణా జిల్లాలో ప్రాణం తీసిన రూ.150 అప్పు

565பார்த்தது
దారుణం.. కృష్ణా జిల్లాలో ప్రాణం తీసిన రూ.150 అప్పు
ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు నగరానికి చెందిన భుజంగరావు అనే వ్యక్తి వెంకటస్వామి వద్ద రూ. 150 లు అప్పు తీసుకొని తీర్చకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி