పంజాబీ డ్రెస్‌ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

64பார்த்தது
పంజాబీ డ్రెస్‌ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
HYD: భర్త భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా, కొణిజేడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌-సోనీ(32) దంపతులు.. కొత్తపేటలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్‌ మేస్త్రీగా, సోని ఇళ్లలో పని చేస్తోంది. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం భార్యాభర్తలు పంజాబీ డ్రెస్ విషయంలో గొడవపడ్డారు. వెంకటేష్ కోపంతో కూరగాయలు కోసే కత్తితో సోనీ కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కాగా సోనీ మృతి చెందింది.

தொடர்புடைய செய்தி