ఇథనాల్ పరిశ్రమపై గ్రామస్థులతో అధికారుల సమావేశం

81பார்த்தது
దిలావర్పూర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారంపై సోమవారం అధికారులు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమ వల్ల కలిగే నష్టాలను రైతులు తహశీల్దార్ స్వాతికి విన్నవించారు. ప్రజలకు నష్టం కలిగించే ఈ పరిశ్రమ తమకు వద్దని గ్రామస్థులు అన్నారు. పరిశ్రమ వల్ల రైతులకు జరిగే నష్టాలను జిల్లా పాలనాధికారికి, ప్రభుత్వానికి తెలియజేయాలని రైతులు కోరారు.

தொடர்புடைய செய்தி