లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య

56பார்த்தது
లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
మతిస్థిమితం లేని ఓ మహిళల ఆత్మహత్య చేసుకున్నట్లు లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం మండలంలోని మమ్మద్ గ్రామానికి చెందిన కవిత (32) కొన్ని రోజులుగా మతిస్థిమితం లేక తరచూ అనారోగ్యానికి గురవుతోంది. సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி