రూ. 81, 000 పలికిన చైతన్య యూత్ గణేష్ లడ్డు

65பார்த்தது
రూ. 81, 000 పలికిన చైతన్య యూత్ గణేష్ లడ్డు
బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఉత్సాహంగా సాగింది. రూ. 81, 000 అత్యధికంగా వేలం పాడి లడ్డును మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. కమిటీ సభ్యులు కోల శ్రీకాంత్, మహేందర్, ప్రశాంత్, సాయి, రాజు, ప్రవీణ్, సురేష్, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி