ఘనంగా సవార్లు ఊరేగింపు

76பார்த்தது
మొహరం వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పట్టణంలోని శాంతినగర్, గాంధీ చౌక్, బొక్కలగూడ, సుభాష్ నగర్, దస్నాపూర్, తదితర ప్రాంతాలలోని సవారి బంగ్లాల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా సవారీలను ప్రత్యేక వస్త్రాలతో అలంకరించారు. ఇందులో భాగంగా ఆదివారం కాలనీలలో సవారీల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మొహరంను పురస్కరించుకొని మూడు రోజులు పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி