యూపీలోని బరేలీలో హృదయ విదారక ఘటన జరిగింది. యూపీ కానిస్టేబుల్ నియామక పరీక్షకు యోగేష్ (24) హాజరయ్యాడు. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. శుక్రవారం పరీక్ష రాశాక చాలా బాధ పడ్డాడు. పరీక్ష బాగా రాయలేదని, ఉద్యోగం రాదని కుంగిపోయాడు. ఫతేగంజ్ తూర్పు ప్రాంతంలోని సైద్పూర్ మంఝా గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.