నీళ్లు తాగేందుకు పరుగున వెళ్లిన విద్యార్థి మృతి

65பார்த்தது
నీళ్లు తాగేందుకు పరుగున వెళ్లిన విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బహోరాలో నివాసం ఉంటున్న ఏడేళ్ల విద్యార్థి జాగర్ సింగ్ నీళ్లు తాగేందుకు వెళ్లి ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చిన్నారి మృతి చెందాడు. కాగా, బెలూన్ గొంతులో ఇరుక్కుపోవడంతో విద్యార్థి నీరు తాగేందుకు పరుగులు తీయగా, ఊపిరాడక చనిపోయినట్టు సమాచారం.

தொடர்புடைய செய்தி