అప్పు చేసి సాగుచేసిన పత్తి పంటను పీకేసిన రైతు (వీడియో)

71பார்த்தது
TG: అప్పు చేసి సాగు చేసిన పత్తి పంటను ఓ రైతు పీకేశాడు. ఆదిలాబాద్(D) భీంపూర్ మండలానికి చెందిన వెంకటి అనే రైతు రూ. 60 వేల పెట్టుబడితో 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాల‌కు రెండెకరాల పత్తి నీట మునిగింది. దీంతో ఆ రెండెక‌రాల నుంచి దిగుబ‌డి రాద‌ని, మ‌రో రెండెక‌రాల నుంచి దిగుబ‌డి వ‌చ్చినా.. మంచి ధ‌ర వచ్చే అవకాశం లేదని వెంకటి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మొత్తం 4 ఎకరాల్లోని ప‌త్తిని శనివారం ఆ రైతు పీకేశాడు.

தொடர்புடைய செய்தி