BREAKING: తీన్మార్ మల్లన్న ఘన విజయం

12523பார்த்தது
BREAKING: తీన్మార్ మల్లన్న ఘన విజయం
వరంగల్ -ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై సుమారు 13 వేల ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. చివరి దశలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతో మల్లన్న vs రాకేష్ మధ్య గట్టి పోటీ నడిచింది. చివరికి BRS అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేట్ అవడంతో మల్లన్న విజయం సాధించారు. మల్లన్నను ఆర్వో అధికారికంగా విజేతగా ప్రకటించారు.

தொடர்புடைய செய்தி