స్కూల్ బస్సు ఢీకొని విశాఖలో 5 ఏళ్ల బాలుడు మృతి

72பார்த்தது
స్కూల్ బస్సు ఢీకొని విశాఖలో 5 ఏళ్ల బాలుడు మృతి
విశాఖ జిల్లా నారాయణరాజు పేటలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి తీసుకొచ్చిన స్కూల్ బస్సు ఢీకొని నర్సరీ చదివే 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రమణ, ఆదిలక్ష్మి దంపతులు తమ పెద్ద కుమారుడు వేణుతేజను రేవిడిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగివచ్చిన వేణుతేజ స్కూల్ బస్సు దిగాడు. అయితే డ్రైవర్ గమనించకుండా బస్సును టర్న్ చేయడంతో బాలుడు చక్రాల కింద నలిగి చనిపోయాడు.

தொடர்புடைய செய்தி