TS: సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, విత్తనాలు, ఎరువుల సరఫరాపై సమీక్షించారు. ఈ మేరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఏర్పా్ట్లను టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి వివరించారు. ప్రిలిమ్స్ పరీక్షను 4.03 లక్షల మంది అభ్యర్థులు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల కోసం 31 జిల్లాల్లో 897 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.