ఎద్దును తప్పించబోయి బోల్తా పడ్డ బస్సు, 18మందికి గాయాలు

544பார்த்தது
ఎద్దును తప్పించబోయి బోల్తా పడ్డ బస్సు, 18మందికి గాయాలు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్‌ జిల్లా సీతాపూర్‌ నుంచి హరిద్వార్‌‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు జాతీయ రహదారిపై ఎద్దును కాపాడే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி