ఉపాధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం: నాదెండ్ల

55பார்த்தது
ఉపాధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం: నాదెండ్ల
గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ‘స్వర్ణాంధ్ర@2024’పై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ‘స్వర్ణాంధ్ర@2024 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నాం. అమరావతి నిర్మాణం, సేవ, ఉపాధిపై సమీక్ష నిర్వహించాం. యువతకు ఉపాధిపై సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. చేనేత, పర్యాటక కేంద్రంగా జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు చేశారు. నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తాం.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி