ఒంగోలు: నేటి నుండి రైతు బజార్ కేంద్రాలలో టమాటాల విక్రయాలు

79பார்த்தது
ఒంగోలు: నేటి నుండి రైతు బజార్ కేంద్రాలలో టమాటాల విక్రయాలు
ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో బుధవారం నుండి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లుగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ. 50 చొప్పున టమాటాలు విక్రయిస్తున్నామని, ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ ను తీసుకురావాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி