ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించిన వెలిగండ్ల ఎస్సై

55பார்த்தது
ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించిన వెలిగండ్ల ఎస్సై
వెలిగండ్ల మండలంలో భారీ వర్షాలు పడుతున్న తరుణంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రావు ప్రమాదకర ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన గన్నవరం గ్రామంలో వాగు పొంగే ప్రదేశాన్ని పరిశీలించి అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు పొంగే సమయంలో ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసరం అయితే తమకు తెలపాలని, సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.

தொடர்புடைய செய்தி