కనిగిరి: ఇకపై పల్లె పల్లెనా అభివృద్ధి: ఎమ్మెల్యే

55பார்த்தது
కనిగిరి: ఇకపై పల్లె పల్లెనా అభివృద్ధి: ఎమ్మెల్యే
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం రూ. 30 లక్షల నిధులతో సీసీ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇకపై ఎన్డీఏ ప్రభుత్వంలో పల్లె పల్లెన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వెనుకబడిన కనిగిరి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி