ట్యాబ్ పరీక్షలు విద్యార్థులకు సాంకేతిక సోపానాలు : ఎంఈఓ-2

77பார்த்தது
ట్యాబ్ పరీక్షలు విద్యార్థులకు సాంకేతిక సోపానాలు : ఎంఈఓ-2
గిద్దలూరు మండలం కంభం లోని స్థానిక గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిబియస్ఈ ట్యాబ్ ఆధారిత బేస్ లైన్ పరీక్షలను మండల విద్యాశాఖ అధికారి-2 కె. శర్వాణి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పెన్ను, పేపర్ అవసరం లేకుండా ట్యాబ్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం సాంకేతిక అభివృద్ధికి సూచికలనీ, ఈ తరహా పరీక్షలు విద్యార్థులకు సాంకేతిక సోపానాలుగా, నైపుణ్యాలకు బాసటగా నిలిచి ఉంటాయని అన్నారు. బాలికలు భయం వీడి సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని హితవు పలికారు. మొత్తం 81 మంది విద్యార్థులు ట్యాబ్ ఆధారిత పరీక్షలో పాల్గొన్నట్లు ఎంఈఓ తెలిపారు.

தொடர்புடைய செய்தி