గిద్దలూరులో జమాయిత్ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెవి నారాయణ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారని భారత దేశంలో కులమతాలకతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రవక్త సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.