టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్తంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ సోమవారం దర్శికి చేరింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి లక్ష్మి సైనికులతో కలిసి పట్టణంలో మొక్కలు నాటారు. దేశభక్తికి చిహ్నంగా ఆర్మీ సైనికులు చేస్తున్న యాత్ర యువతకు ఆదర్శమని లక్ష్మీ కొనియాడారు.