టీడీపీ కార్యాలయంపై దాడి.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు

74பார்த்தது
టీడీపీ కార్యాలయంపై దాడి.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసు నిందితులుగా ఉన్న వారిని సోమవారం విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

தொடர்புடைய செய்தி