మాచర్ల :పెరటి తోటలను పెంచండి

75பார்த்தது
మాచర్ల :పెరటి తోటలను పెంచండి
వినుకొండ మండల పరిధిలోని జంగాలపల్లి, తలార్లపల్లి ఐటీసీసెర్చ్ ఆధ్వర్యంలో శనివారం కూరగాయల మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటిసి సిఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ ఇంటిలో ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ కూరగాయ మొక్కలను ఇంట్లోనే పెంచుకోవాల్సిందిగా కోరారు. ఇంట్లో పెంచుకోవడం వలన కెమికల్స్ లేకుండా 100% ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే విధంగా ఉంటుందని, తద్వారా జీవన ప్రమాణం పెరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி