ఈ నెల 30 వరకు ఈ-కేవైసీ గడువు పెంపు

70பார்த்தது
ఈ నెల 30 వరకు ఈ-కేవైసీ గడువు పెంపు
రైతులు తమ పంట వివరాలను ఈ-క్రాప్ లో భాగంగా ఈ-కేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. గుంటూరు జిల్లాలో 1, 87, 284 ఎకరాల్లో ఈ-కే వైసీ పూర్తి చేశామన్నారు. మరో 27, 168 ఎకరాలకు రైతులు చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி