విద్యార్థి దశ నుంచే ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి

85பார்த்தது
విద్యార్థి దశ నుంచే ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్స్ హై స్కూల్ నందు గురువారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మీకు తెలుసా ఆ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుకునే దశ నుంచే ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే విద్యలో రాణిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி